Friday, September 13, 2024
spot_img
HomeNewsఖమ్మంలో బీజేపీ బహిరంగ సభ...Kishan Reddy కి మొదటి పరీక్ష !?

ఖమ్మంలో బీజేపీ బహిరంగ సభ…Kishan Reddy కి మొదటి పరీక్ష !?

BJP Meeting in Khammam Today : నేడు ఖమ్మంలో ‘రైతు గోస-బీజేపీ భరోసా’ సభ..నేడు ఖమ్మం లో భాజాపా అగ్రనేత అమిత్ షా బహిరంగ సభ జరుగుతోంది . ఈ సభ నేపథ్యం … ఎన్నికలు సమీపిస్తున్న తరుణం .. కిషన్ రెడ్డి కి భాజాపా రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పిన తర్వాత జరుగుతున్న రెండవ బహిరంగ సభ . అసలే ఖమ్మం జిల్లా లో భాజాపా కు పెద్దగా ఆదరణ లేదు . జిల్లాస్థాయి నాయకులు కానీ అసెంబ్లీ స్థాయి నాయకులు గా అసలే లేరు . గత 2018 ఎన్నికల్లో 10 శాసన సభా స్థానాలకు గాను మొత్తం పొలయున ఓట్ల లో 15,855 (1%) సాధించింది .

ఇక తదుపరి జరిగిన 2019 లోకసభ ఎన్నికల్లో సుమారు 30,000 వేల ఓట్లను సాధించింది . ఈ నేపథ్యంలో అమిత్ షా సభను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారు . ఈ సభకు హాజరవుతున్న కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఖమ్మం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు . బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ బలం గా వున్న ఖమ్మం జిల్లా ను , ఏమాత్రం బలం లేని భాజాపా ఎంచుకోవడం చేస్తే ఎవరి లబ్ది కోసం ఈ సభ అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి . కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను వడబోస్తున్న నేపథ్యంలో ఆదివారం జరగబోయే సభలో అమిత్ షా ఏం మాట్లాడుతారు? ఏమైనా కీలక ప్రకటనలు చేస్తారా?. బీజేపీలోకి కొత్తగా ఏమైనా చేరికలు ఉంటాయా? అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా , అమిత్ షా సభ జరిగే మైదానంలో ఏర్పాటుచేసిన ప్లెక్సీల్లో ఈటల రాజేందర్ ఫోటోలు లేవంటూ నిర్వహణ కమిటీ సభ్యులను ఈటల వర్గీయులు నిలదీసారు. ఈటలను అవమానించేలా వ్యవహరించడం సరికాదని… ఇలాగయితే అమిత్ షా సభను బహిష్కరిస్తామని ఈటల వర్గీయులు హెచ్చరించారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments