Friday, October 18, 2024
spot_img
HomeCinemaతమిళనాడు ప్రమాదం: 8 మంది అయ్యప్ప భక్తులు మృతి

తమిళనాడు ప్రమాదం: 8 మంది అయ్యప్ప భక్తులు మృతి

[ad_1]

తమిళనాడు ప్రమాదం: 8 మంది అయ్యప్ప భక్తులు మృతి
తమిళనాడు ప్రమాదం: 8 మంది అయ్యప్ప భక్తులు మృతి

తమిళనాడు ప్రమాదం: అండిపట్టి సమీపంలోని సన్ముగసుందరపురం గ్రామానికి చెందిన 10 మంది అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం చేసుకుని ఇంటికి వెళుతుండగా వారి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నిన్న రాత్రి జరిగింది. 2 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 3 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. కేరళ, తమిళనాడు సరిహద్దుల్లోని తేని జిల్లాలో శుక్రవారం రాత్రి కారు కాలువలో పడి 8 మంది అయ్యప్ప భక్తులు మృతి చెందారు. జిల్లా కలెక్టర్ కెవి మురళీధరన్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమిలి పర్వతం ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది, అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు దాదాపు 40 అడుగుల లోతులో ఉన్న గోతిలో పడిపోయింది. కారులోని ప్రయాణికులంతా తేని-అండిపెట్టి వాసులు. ప్రమాదం జరిగినప్పుడు కారులో మొత్తం పది మంది ఉన్నారని పోలీసులు తెలిపారు.

ప్రకటన

ఈ ప్రమాదంలో 7 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా 1 వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు కనిపించలేదు. ఇదే ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

కోవిడ్-19 కారణంగా గత రెండేళ్లుగా శబరిమల అయ్యప్ప స్వామి యాత్రపై నిషేధం విధించారు. ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేయడంతో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. ఈ తీర్థయాత్ర మండలం-మకరవిళక్కుకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. ఏటా 10 నుంచి 15 లక్షల మంది శబరిమలను సందర్శిస్తుంటారు.

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments