Sunday, September 8, 2024
spot_img
HomeNewsపార్టీ మార్పు వదంతులే ..! తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం .. రాంరెడ్డి...

పార్టీ మార్పు వదంతులే ..! తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం .. రాంరెడ్డి దామోదర్ రెడ్డి

ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర్ రెడ్డి పార్టీ మార్పుపై వస్తున్న కథనాలపై తీవ్రం గా స్పందించారు. మజీ మంత్రి కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి. ఎన్నికలు త్వరలో రానున్న తరుణం లో తప్పుడు వదంతువులు సృష్టిస్తున్నారని అన్నారు. తన పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని , తమ కుటుంబం నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నామని తనపై ఇలాంటి తప్పుడు వార్తలు రావడం దురద్రష్టకరమన్నారు. ఈ తప్పుడు వదంతులను ప్రజలు, కాంగ్రెస్ అభిమానులు , కార్యకర్తలు నమ్మొదన్ని సూచించారు.

తనని పార్టీ మారమని అడిగే దమ్ము ఎవరికి లేదని,, తన పుట్టుక తన తుది శ్వాస అన్ని కాంగ్రెస్ లోనే అని   దామోదర్తె రెడ్డి తెలిపారు . టికెట్ తనదేనని గెలుపు కూడా తనదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనకు జిల్లాలో కానీ , రాష్ట్రం లో కానీ గ్రూపులు లేవని , తాను కాంగ్రెస్ సోనియా గ్రూప్ అని చెప్పుకొచ్చారు . తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తానని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments