Sunday, September 15, 2024
spot_img
HomeNewsతెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ..

తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ..

తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్థానంలో కేంద్ర భాజాపా నిర్ణయం తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని నియమించారు . వారి అభిప్రాయం అందరిని వెంట తీసుకెళ్లగల “మృదువైన” నాయకుడు కిషన్ రెడ్డి అని . BRS నుండి BJP లోకి మారిన ఈటెల రాజేందర్‌ను తెలంగాణ భాజాపా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించారు .

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ రోజు నాంపల్లిలోని భాజాపా పార్టీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్, తరుణ్ చుగ్, ఎంపీ బండి సంజయ్ , ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, సీనియర్ నేత విజయశాంతి హాజరు అయ్యారు . ప్రమాణ స్వీకారానికి ముందు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల నుంచి కిషన్‌రెడ్డి ఆశీర్వాదం పొందారు .

చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని కిషన్ రెడ్డి సందర్శించారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు వెంట రాగా ఆయన ప్రత్యేక పూజల్లో చేశారు. ఓ కార్యకర్త ఇచ్చిన కత్తిని పట్టుకుని చార్మినార్‌ వైపు చూపించడం విశేషం . అనంతరం ర్యాలీగా బయలుదేరి అంబర్‌పేటలోని మహాత్మా ఫూలే విగ్రహానికి నివాళులర్పించి , అక్కడి నుంచి బషీర్ భాగ్ లోని కనకదుర్గ ఆలయం లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తదుపరి ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు.

భాగ్యలక్మి టెంపుల్
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments