బీజేపీకి భారీ షాక్.. ఈటల గుడ్ బైత్వరలో కాంగ్రెసులోకి ఈటెలతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీలక నేత, ఈటల రాజేందర్ ఘోర పరాజయం పాలైన సంగతి మీ అందరికి తెలిసిందే. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఘోరపరాజయం చవి చూసారు . ఈటెల సొంత నియెజకవర్గమైన హుజురాబాద్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఒడి పోయారు, చాలెంజ్ చేసి మరీ పోటీకి దిగిన గజ్వేల్లో గులాబీ దళపతి కెసిఆర్ చేతిలోనూ దారుణంగా ఓడిపోయారు. రెండుచోట్లా కూడా రెండో స్థానానికి పరిమితం అయ్యారు ఈటెల రాజేందర్ . గజ్వేల్లో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఇద్దరు ప్రచారం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఈ అపజయంతో ప్రస్తుతం ఈటల రాజేందర్ సైలెంట్ గ ఉన్నారు . బీజేపీ పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనడం లేదు. ఈ మధ్య బీజేపీకి షాకిచ్చేలా ఓ ఫొటో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ క్రమంలో భాగంగా బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మొన్న ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ప్రయివేట్ పార్టీలో పాల్గొన్నారు.
ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కీలకంగా చర్చింనట్లు సమచారం.ఈ సమావేశ తరువాత ఈటల పార్టీని వీడబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో విస్తృతమయ్యాయి.ఈటెల రాజేందర్ కాంగ్రెస్లో చేరిక ఖరారు అయితే.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కరీంనగర్ నియోజకవర్గ బరిలోపోటీచేస్తారు అని తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ .. పార్లమెంట్ ఎన్నికల్లోను అదే ఊపును కంటిన్యూ చెయ్యాలి అని చూస్తున్నారుఇందులోభాగంగానే కాంగ్రెస్ పార్టీలోకి కీలక నేతల అందరిని చేర్చుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటే కాంగ్రెస్కు మరింత బలం చేకూరిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సర్వేలు సైతం అన్ని లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కే మొగ్గు చూపుతున్నాయి. ఇందులో భాగం గానే ఈటల రాజేందర్ తీసుకునే నిర్ణయంపై యావత్ తెలంగాణ రాష్ట్రం సర్వత్రా ఆసక్తి గ ఎదురుచూస్తుంది అని సమాచారం .