Friday, January 31, 2025
spot_img
HomeNewsAndhra PradeshReal Estate in Andhra Pradesh (2023) స్థిరాస్తి రంగం

Real Estate in Andhra Pradesh (2023) స్థిరాస్తి రంగం

ఆంధ్ర ప్రదేశ్ లో స్థిరాస్తి రంగం లో వృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన వుంది . తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ ఆయన తెలంగాణా నిర్మాణాల్లో , క్రయవిక్రయాల్లో దూసుకుపోతోంది. ఇటీవల కోకాపేట లో ఎకరం 100 కోట్లకు వేలం జరిగిన విషయం అందరికి విదితమే . ఇక తెలంగాణ జిల్లాలలో 2014 ప్రాంతం లో ఎకరం 2 లక్షలు వుండే భూమి ఇప్పుడు 15 లక్షల నుండీ 40 లక్షల వరకూ పెరిగింది . ఇక GHMC పరిధిలో రియల్ ఎస్టేట్ కు పగ్గాలు లేవు . శరవేగం తో అభివృద్ధి చెందుతోంది .

ఆంధ్ర ప్రదేశ్ లో స్థిరాస్తి రంగం గతం లో ఎన్నడూ లేనంతగా వెల వెల పోతుంది . రిజిస్ట్రేషన్ల ఆదాయ పరం గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏంటో వెనుకబడి వుంది . స్థిరాస్తి రంగం లో 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తదుపరి చంద్రబాబు నాయుడు చొరవతో అమరావతి ప్రాంతం శరవేగం గా అభివృద్ధి పధం వైపు అడుగులు వేసింది . అయితే 2019 లో అధికార మార్పు , అమరావతి రాజధాని ప్రాంతం లో స్థిరాస్తి రంగం లో కుదేలయుంది. గ్రోత్ ఇంజిన్ గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లగలిగిన అమరావతి ని పాలకులు ముంచేశారు . 3 రాజధానుల వ్యవహారం కోర్టు వివాదాల్లో వుంది .

పరిశ్రమలు కొత్తవి రాకపోగా వున్న పరిశ్రమలు పోయాయి . స్థిరాస్తి అమ్ముదామంటే కొనే నాధుడే లేకుండా పోయారు . రహదారులు రాష్ట్ర వ్యాప్తం గా గుంతల మయం గా మారాయి . మౌలిక సదుపాయాల కల్పన ప్రకటనలకే పరిమిత మయ్యుంది . అయితే నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) ప్రధాన కార్యదర్శి మామిడి సీతారామయ్య మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి ఐటి కంపెనీలు మరియు ఇతర పరిశ్రమల స్థాపనపై ఎక్కువగా ఆధారపడి ఉందని అన్నారు . క్రెడాయ్ మాజీ చైర్మన్ ఎ శివా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని అన్నారు. “పరిశ్రమలో వృద్ధి మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి, రాష్ట్ర రాజధాని నగరానికి సంబంధించి తక్షణమే స్పష్టత అవసరం,” అన్నారు .

Orr in Amaravathi Capital 2024

అయితే 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లో కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలు అధికార మార్పిడి దిశగా ప్రయాణం చేస్తున్నాయి. NRI ఇన్వెస్టర్లు రాక మొదలైంది . హైదరాబాద్ , బెంగుళూరు ల నుంచీ స్థిరాస్తి వ్యాపార లావాదేవీలు మొదలయ్యాయి అని స్థానిక స్థిరాస్తి సంస్థల ద్వారా తెలుస్తోంది . కొత్త ప్రభుత్వం రావడం ఖాయం గా కనిపించడం తో , హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారం ఖరీదైనది గా మారడం తో కొంతమంది దృష్టి అమరావతి వైపు మారినట్లు సమాచారం . స్థిరాస్తి (భూములు ) రేట్లు 6% నుంచీ 12% శాతం పెరిగినట్లు తెలుస్తోంది . ఇక రాష్ట్రము లోని రాజమండ్రి , వైజాగ్ , తిరుపతి , కర్నూల్ ముఖ్య పట్టణాల్లో కూడా ఇదే స్థాయి లో పెరుగుదల ఉన్నట్లు తెలుస్తోంది . ఆంధ్ర ప్రదేశ్ లో స్థిరాస్తి రంగం లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అని స్థిరాస్తి రంగ ఆర్ధిక నిపుణుల సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments